బీజేపీది రైతు వ్యతిరేక వైఖరి

ABN , First Publish Date - 2020-11-01T10:21:46+05:30 IST

కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఏపీ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి ఆరోపించారు.

బీజేపీది రైతు వ్యతిరేక వైఖరి

రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి


విజయనగరం రింగురోడ్డు, అక్టోబరు 31: కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఏపీ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి ఆరోపించారు. రైతు హక్కుల దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శనివారం సత్యాగ్రహం కార్యక్రమాన్ని నిర్వహించారు. హాజరైన రమణకుమారి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులపై కర్కశంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.  బీజెపీ ప్రభుత్వం ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతుల నుంచి సంతకాలు సేకరిస్తామని చెప్పారు. రెండు కోట్ల మంది రైతుల నుంచి సంతకాలు సేకరించి ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తామన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్‌ అండగా ఉంటుందని తెలిపారు.  కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సరగడ రమేష్‌కుమార్‌, పీసీసీ ప్రధాన కార్యదర్శి బొడ్డు శ్రీనివాసరావు, సుంకరి సతీష్‌, జమ్ము ఆదినారాయణ, వెంకట రమణరావు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-01T10:21:46+05:30 IST