వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఆందోళనకు కాంగ్రెస్ యోచన
ABN , First Publish Date - 2020-09-19T07:27:31+05:30 IST
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయబిల్లులను వ్యతిరేకిస్తూ జాతీయస్థాయిలో ఆందోళన చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇతర ప్రతిపక్షాలను కలుపుకుని వర్చువల్,
న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయబిల్లులను వ్యతిరేకిస్తూ జాతీయస్థాయిలో ఆందోళన చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇతర ప్రతిపక్షాలను కలుపుకుని వర్చువల్, భౌతిక నిరసనలు చేసేలా ఆయాపార్టీలతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ]
మరోవైపు, కేంద్ర ప్రభుత్వ రైతు విధానాలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జెవాలా శుక్రవారం తీవ్ర విమర్శలు చేశారు. ఒక పక్క కరోనా వైరస్ విజృంభణ, మరోపక్క చైనా కయ్యానికి కాలుదువ్వుతున్న వేళ... ప్రధాని అసత్యాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.