రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం
ABN , First Publish Date - 2022-07-05T06:01:19+05:30 IST
రైతుల సంక్షేమమే కాంగ్రేస్ పార్టీ ధ్యేయమని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.
-పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు
ఎలిగేడు, జూలై 4: రైతుల సంక్షేమమే కాంగ్రేస్ పార్టీ ధ్యేయమని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సోమవారం ఎలిగేడు మండలం లాలపల్లిలో రైతు రచ్చబండను నిర్వహించారు. ఈసందర్భంగా విజయరమణారావు మాట్లాడారు. కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ, భూమి ఉన్న రైతులతో పాటు ఏడాదికి ఎకరాకు 15వేల రూపాయలు, భూమి లేని ఉపాధిహామీ కూలీలకు 12వేల రూపాయలు ఇస్తామని తెలిపారు. అన్ని పంటలకు మద్దతు ధర చెల్లిస్తామన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో కాంగ్రేస్ పార్టీ మండల అధ్యక్షుడు సామ రాజేశ్వర్రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి దుగ్యాల సంతోష్రావు, సుల్తాన్పూర్, లాలపల్లి, శివపల్లి, సర్పంచ్లు అర్షనపల్లి వెంకటేశ్వర్రావు, సింగిరెడ్డి ఎల్లవ్వ, దుగ్యాల శ్వేత, మాజీ సర్పంచ్ కొండ తిరుపతిగౌడ్, నరహరి సుధాకర్రెడ్డి, గోసిక శంకర్, ఉపసర్పంచ్ పెద్ది సరవ్వ, నాయకులు కొప్పర తిరుమల్రెడ్డి, అనిల్, మల్లేశం, మహిళలు, యువకులు పాల్గొన్నారు.