ప్రియాంక కన్నియాకుమారి పర్యటన 3కు వాయిదా
ABN , First Publish Date - 2021-03-27T12:41:32+05:30 IST
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కన్నియాకుమారి ప్రచార పర్యటన ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా పడింది. కన్నియాకుమారి లోక్సభ స్థానంలో కాంగ్రెస్
చెన్నై: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కన్నియాకుమారి ప్రచార పర్యటన ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా పడింది. కన్నియాకుమారి లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయ్ వసంత్ పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా ప్రియాంకా గాంధీ శనివారం ప్రచారానికి రావాల్సి ఉంది. కానీ, ఆమె పర్యటన వాయిదా పడింది. శనివారమే అన్నాడీఎంకే కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడానికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో సహా మరికొంతమంది రాష్ట్రానికి రానున్నారు. దీంతో ప్రియాంక తన పర్యటనను ఏప్రిల్ మూడో తేదీకి వాయిదా వేసుకున్నారు. ఆ రోజున ఆమె ఢిల్లీ నుంచి తిరువనంతపురానికి చేరుకుని అక్కడ నుంచి కన్నియాకుమారి జిల్లా కుళచ్చల్ స్థానానికి వచ్చి కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తారు.