కాంగ్రెస్‌ పార్టీ అడ్‌హక్‌ కమిటీల ఏర్పాటు

ABN , First Publish Date - 2022-05-25T05:07:15+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా దేశ వ్యాప్తంగా సంస్థాగత ఎన్ని కలు నిర్వహిస్తున్నట్లు డీసీ సీ అధ్యక్షుడు గ్రంథాల గిరీష్‌కుమార్‌ తెలిపారు.

కాంగ్రెస్‌ పార్టీ అడ్‌హక్‌ కమిటీల ఏర్పాటు
సమావేశంలో మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు గిరీష్‌కుమార్‌

రాయచోటిటౌన్‌, మే 24: కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా దేశ వ్యాప్తంగా సంస్థాగత ఎన్ని కలు నిర్వహిస్తున్నట్లు డీసీ సీ అధ్యక్షుడు గ్రంథాల గిరీష్‌కుమార్‌ తెలిపారు.  ఆ పార్టీ జిల్లా రిటర్నింగ్‌ అధికారి సుబ్రమణ్యం మం గళవారం రాయచోటిలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ స్థానిక ఇన్‌చార్జి గోల్డ్‌ అల్లాబకష్‌, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఆడిటర్‌ మన్సూర్‌అలీఖాన్‌, బీఆర్‌వోలు దర్బార్‌బాషా, శర్వాణిఫారుక్‌ఖాన్‌, జిల్లా కార్యదర్శి యహియాబాషా, మదనపల్లె ఇంతియాజ్‌ ఆయనక సాదరంగా స్వాగతం పలికి దుశ్శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడితో కలసి ఆయన మాట్లాడుతూ  పార్టీ బలోపేతం కోసం నిర్వహిస్తున్న సంస్థాగత ఎన్నికలను జూన్‌ 15వ తేదీ లోగా పూర్తి చేయాలని అధిష్టానం సూచించిందన్నారు. రాహుల్‌గాంధీని ప్రధాన మంత్రి చేయడం లక్ష్యంగా కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. 


Updated Date - 2022-05-25T05:07:15+05:30 IST