జాతికి కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలి : ప్రకాశ్ జవదేకర్

ABN , First Publish Date - 2020-10-30T18:23:04+05:30 IST

పుల్వామా దాడి వెనుక తామే ఉన్నట్లు పాకిస్తాన్ ఒప్పుకుందని, పుల్వామా వెనుక కుట్ర ఉందంటూ ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ వెంటనే

జాతికి కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలి : ప్రకాశ్ జవదేకర్

న్యూఢిల్లీ : పుల్వామా దాడి వెనుక తామే ఉన్నట్లు పాకిస్తాన్ ఒప్పుకుందని, పుల్వామా వెనుక కుట్ర ఉందంటూ ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ వెంటనే క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ డిమాండ్ చేశారు. ‘‘పుల్వామా ఉగ్రదాడి వెనుక తామే ఉన్నట్లు పాక్ ప్రకటించింది. కుట్ర సిద్ధాంతమంటూ లేనిపోని ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇతర పక్షాలు జాతికి వెంటనే క్షమాపణలు చెప్పాలి.’’ అని ట్విట్టర్ వేదికగా జవదేకర్ డిమాండ్ చేశారు. 

సొంత గడ్డమీదే భారత్ ను దెబ్బకొట్టాం : మంత్రి ఫవాద్

పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి తామే బాధ్యులమని సైన్స్, టెక్నాలజీ మంత్రి ఫవాద్ చౌధరి గురువారం ప్రకటించారు. ‘‘మనం భారత్ ను వారి గడ్డమీదే దెబ్బకొట్టాం. పుల్వామాలో మనం విజయం సాధించాం. ఇది ఇమ్రాన్ నేతృత్వంలోని పాక్ కు దక్కిన గెలుపు. ఈ విజయంలో మనమంతా భాగస్వాములమే.’’ అని ఫవాద్ పాక్ అసెంబ్లీలో తెలిపారు. 

Updated Date - 2020-10-30T18:23:04+05:30 IST