వాడీవేడిగా Congress ఆర్గనైజేషన్ కమిటీ సమావేశం

ABN , First Publish Date - 2022-06-01T23:55:13+05:30 IST

టి.కాంగ్రెస్ మేథోమధన సదస్సులో ఆర్గనైజేషన్ కమిటీ సమావేశం వాడీవేడిగా జరిగింది. క్రమశిక్షణ కమిటీ పనితీరు సరిగాలేదంటూ నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాడీవేడిగా Congress ఆర్గనైజేషన్ కమిటీ సమావేశం

హైదరాబాద్: టి.కాంగ్రెస్ మేథోమధన సదస్సులో ఆర్గనైజేషన్ కమిటీ సమావేశం వాడీవేడిగా జరిగింది. క్రమశిక్షణ కమిటీ పనితీరు సరిగాలేదంటూ నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తుల కోసమే క్రమశిక్షణ కమిటీ పనిచేస్తోందని విమర్శించారు. ఒకరిద్దరు నేతల కనుసన్నల్లోనే క్రమశిక్షణ కమిటీ పనిచేస్తుందని కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు. సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వట్లేదని కొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షులను పట్టించుకోవడం లేదని మరికొందరు నేతలు దుయ్యబట్టారు.

Updated Date - 2022-06-01T23:55:13+05:30 IST