ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ

ABN , First Publish Date - 2022-03-10T17:45:10+05:30 IST

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నాలుగు రాష్ట్రాల్లో (పంజాబ్ మినహా) బీజేపీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఈ నాలుగు రాష్ట్రాల్లో గతంలో కూడా బీజేపీ అధికారంలో ఉంది. మళ్లీ ఈ నాలుగు రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకోబోంది. పంజాబ్‌లో మాత్రం ఆప్ అధికారంలోకి వస్తుంది. ఊహించని విధంగా 88 సీట్లకుపైగా ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో ఆప్ కార్యాలయం వద్ద ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. పంజాబ్‌లో 117 స్థానాలకు గానూ 88 స్థానాలు ఆప్ కైవసం చేసుకుంది.

Updated Date - 2022-03-10T17:45:10+05:30 IST