పార్లమెంటు గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నిరసన

ABN , First Publish Date - 2021-11-29T16:39:06+05:30 IST

పార్లమెంటు గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఎంపీలు సోమవారం

పార్లమెంటు గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నిరసన

న్యూఢిల్లీ : పార్లమెంటు గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఎంపీలు సోమవారం ఉదయం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి చట్టపరమైన మద్దతును ఇవ్వాలని వీరంతా డిమాండ్ చేశారు. మూడు సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ జరిగిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. 


అంతకుముందు ప్రతిపక్ష పార్టీల నేతల సమావేశం జరిగింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పార్లమెంటులో లేవనెత్తవలసిన అంశాలపై చర్చించారు. 11 ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-29T16:39:06+05:30 IST