రాష్ట్రపతి పాలన విధించాకే ఎన్నికలు నిర్వహించాలి:Uttam
ABN , First Publish Date - 2022-07-02T01:58:32+05:30 IST
తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్(congress) ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి (Uttam kumar reddy) డిమాండ్ చేశారు
సూర్యాపేటజిల్లా: తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్(congress) ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి (Uttam kumar reddy) డిమాండ్ చేశారు.రాష్ట్రపతి పాలన విధించాకే అసెంబ్లీ ఎన్నికలు జరపాలని అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సర్కిల్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన అధికార పార్టీ ఆగడాలను పోలీసులకు వివరించారు. కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని సీఐకు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించే వారిపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించి ఎన్నికలు నిర్వహించాలని పార్లమెంట్ లో కోరతానని అన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. లేకపోతే తిప్పలు తప్పవని ఉత్తమ్ హెచ్చరించారు.రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.