నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం

ABN , First Publish Date - 2022-05-02T14:10:44+05:30 IST

విద్యార్థి నాయకుల అరెస్టులకు నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం చేయనున్నారు.

నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం

హైదరాబాద్: విద్యార్థి నాయకుల అరెస్టులకు నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం చేయనున్నారు. ఈ మేరకు ఎంపీ రేవంత్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని  ప్రశ్నించినందుకు ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షులు బలమూరి వెంకట్‌తో పాటు 18 మంది ఎన్‌ఎస్‌యూఐ నాయకులను అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వేధించడం దుర్మార్గమని మండిపడ్డారు. వెంకట్‌తో పాటు విద్యార్థి నాయకుల అరెస్టులు చేసి జైల్లో పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అరెస్టులకు నిరసనగా ఈరోజు సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, యువకులు కేసీఆర్ పాశవిక చర్యలను ఖండిస్తూ ఉద్యమించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 

Updated Date - 2022-05-02T14:10:44+05:30 IST