ఇంతకన్నా దారుణ విషయం ఇంకేమీ లేదు: ఎంపీ Komati reddy
ABN , First Publish Date - 2022-07-21T19:40:51+05:30 IST
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈ.డీ విచారణకు పిలవడం ఇంతకన్నా దారుణ విషయం ఇంకేమీ లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్(Congress) అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia gandhi)ని ఈడీ(ED) విచారణకు పిలవడం ఇంతకన్నా దారుణ విషయం ఇంకేమీ లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy venkat reddy) మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... స్వాతంత్ర్యం కోసం పెట్టిన నేషనల్ ఇరాల్డ్ కేసులో అనారోగ్యంతో ఉన్న సోనియాగాంధీని ఈరోజు విచారణకు పిలిచారన్నారు. నాలుగు సార్లు పార్లమెంట్ సభ్యురాలిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న సోనియా గాంధీని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోనియాగాంధీ ఈడీ విచారణతో కాంగ్రెస్ కార్యకర్తలే కాదు దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు కూడా బాధపడుతున్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిర్వహిస్తున్న ఆందోళన నేపథ్యంలోనే క్యాడర్ను దెబ్బతీసేందుకు ఈడీ అధికారులు అగ్రనేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే విధంగా అక్రమ కేసులు పెడుతున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఆరోపించారు.