ఎంపీ కార్తీ చిదంబరానికి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-08-03T18:03:46+05:30 IST

దేశంలోని రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కర్నాటక సీఎం

ఎంపీ కార్తీ చిదంబరానికి కరోనా పాజిటివ్

న్యూఢిల్లీ : దేశంలోని రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కర్నాటక సీఎం యడియూరప్పతో పాటు మరికొంత మంది ప్రముఖులు కూడా కరోనా బారినపడ్డారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కుమారుడు, ఎంపీ కార్తీ చిదంబరానికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ‘‘నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. వైద్యుల సూచనల మేరకు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయా. నాతో సమావేశాల్లో పాల్గొన్న వారందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నా’’ అని కార్తీ చిదంబరం ట్వీట్ చేశారు. 

Updated Date - 2020-08-03T18:03:46+05:30 IST