నాకేదైనా అయితే పంజాబ్ సీఎందే బాధ్యత: కాంగ్రెస్ ఎంపీ

ABN , First Publish Date - 2020-08-12T02:20:10+05:30 IST

అయితే తనకు పూర్తిగా భద్రత తొలగించారని, దీనికి సంబంధించి రాష్ట్ర డీజీపీ ఆదేశాలు జారీ చేశారని అంటున్నారు. దీని వెనుక రాజకీయ నేతల ఒత్తిళ్లు ఉన్నాయని బజ్వా ఆరోపిస్తున్నారు

నాకేదైనా అయితే పంజాబ్ సీఎందే బాధ్యత: కాంగ్రెస్ ఎంపీ

న్యూఢిల్లీ: పంజాబ్ సీఎం, కాంగ్రెస్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై సొంత పార్టీ నేతే తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు ఏదైనా జరిగితే కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో పాటు పంజాబ్ డీజీపీదే బాధ్యతని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతాప్ సింగ్ బజ్వాకు ఉన్నట్లుండి భద్రతలో మార్పులు చేశారు. అయితే తనకు పూర్తిగా భద్రత తొలగించారని, దీనికి సంబంధించి రాష్ట్ర డీజీపీ ఆదేశాలు జారీ చేశారని అంటున్నారు. దీని వెనుక రాజకీయ నేతల ఒత్తిళ్లు ఉన్నాయని బజ్వా ఆరోపిస్తున్నారు.


‘‘ఉన్నట్టుండి రాత్రికి రాత్రే నాకు భద్రత తొలగించారు. పంజాబ్ డీజీపీ ఆదేశాల మేరకే ఇలా జరిగింది. అయితే దీని వెనుక రాజకీయ పరమైన ఒత్తిళ్లు ఉన్నాయి. వారి సూచనల మేరకే డీజీపీ ఈ ఆదేశాలు జారీ చేశారు. నాకేదైనా అయితే కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో పాటు పంజాబ్ డీజీపీదే బాధ్యత’’ అని బజ్వా అన్నారు.

Updated Date - 2020-08-12T02:20:10+05:30 IST