జిందా తిలిస్మాత్‌లా రైతుబంధు: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-09-08T23:11:18+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ

జిందా తిలిస్మాత్‌లా రైతుబంధు: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

జగిత్యాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రతి దానికి జిందా తిలిస్మాత్‌లా రైతుబంధు అయిపోయిందని జీవన్‌రెడ్డి అన్నారు. అన్నింటికీ రైతు బంధు మందేనా అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించడానికి టీఆర్‌ఎస్‌ భయపడుతోందని జీవన్‌రెడ్డి విమర్శించారు. 


Updated Date - 2021-09-08T23:11:18+05:30 IST