ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్!

ABN , First Publish Date - 2021-11-23T02:00:51+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే యోచనలో కాంగ్రెస్ ఉంది. ఖమ్మం-నాగేశ్వరరావు, మెదక్-నిర్మల జగ్గారెడ్డి, నిజామాబాద్-మహేష్ కుమార్‌గౌడ్

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్!

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే యోచనలో కాంగ్రెస్ ఉంది. ఖమ్మం-నాగేశ్వరరావు, మెదక్-నిర్మల జగ్గారెడ్డి, నిజామాబాద్-మహేష్ కుమార్‌గౌడ్, వరంగల్-వేం వాసుదేవరెడ్డిలను పోటీ చేయించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల పేర్లను కాసేపట్లో కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించనుంది. రేపటితో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో పోటీ చేయాల వద్దా? పోటీ చేస్తే అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సంబంధించిన నిర్ణయాన్ని.. ఆయా జిల్లాల డీసీసీలకే అప్పగించాలని కాంగ్రెస్ పెద్దలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-11-23T02:00:51+05:30 IST