కర్ణాటక అసెంబ్లీ ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసన

ABN , First Publish Date - 2022-06-09T16:52:19+05:30 IST

పాఠ్యపుస్తకాల్లో ఆర్ఎస్ఎస్ నేతల ప్రసంగాలను చేర్చడంపై కర్ణాటకలో పెద్ద ఎత్తున రాజకీయ వివాదం చెలరేగింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య వివాదం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. కాగా, విద్యను కాషాయీకరణం చేస్తున్నారంటూ కర్ణాటక అసెంబ్లీ భవనం ముందు విపక్ష నేత సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరనసకు దిగారు..

కర్ణాటక అసెంబ్లీ ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసన

బెంగళూరు: పాఠ్యపుస్తకాల్లో ఆర్ఎస్ఎస్ నేతల ప్రసంగాలను చేర్చడంపై కర్ణాటకలో పెద్ద ఎత్తున రాజకీయ వివాదం చెలరేగింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య వివాదం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. కాగా, విద్యను కాషాయీకరణం చేస్తున్నారంటూ కర్ణాటక అసెంబ్లీ భవనం ముందు విపక్ష నేత సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరనసకు దిగారు. బీజేపీకి వ్యతిరేకంగా ఫ్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కర్ణాటక పదవ తరగతి పుస్తకంలో స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పాఠాన్ని తొలగించిన ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ ప్రసంగాన్ని చేర్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో భగత్ సింగ్ పాఠాన్ని తొలగించడం లేదని కర్ణాటక ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అయితే హెగ్డేవార్ ప్రసంగం మాత్రం ఉంటుందని పేర్కొంది.

Updated Date - 2022-06-09T16:52:19+05:30 IST