ఇంతకు పువ్వాడకు బుర్ర ఉందా: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2022-04-23T23:27:51+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీజేపీ కార్యకర్త సాయి ఆత్మహత్య కేసులో

ఇంతకు పువ్వాడకు బుర్ర ఉందా: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీజేపీ కార్యకర్త సాయి ఆత్మహత్య కేసులో అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు బుర్ర ఉందా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిలదీశారు. గాంధీ‌భవన్ వద్ద మంత్రి పువ్వాడ దిష్టి బొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అరాచకాలు పెరిగాయన్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్లను వేధించి పీడీ యాక్ట్‌లు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. పువ్వాడ వేధింపులతో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన తెలిపారు. చెడ్డ పనులు చేసి కమ్మ కులం పరువు తీయొద్దని మంత్రికి ఆయన హితవు పలికారు. పువ్వాడను కమ్మ కులం నుంచి బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి మంత్రిని కేసీఆర్ ఎందుకు కొనసాగిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. వెంటనే పువ్వాడను బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పువ్వాడది మాత్రమే కమ్మ కులం కాదని, చనిపోయిన సాయిది కూడా అదే కులమని ఆయన పేర్కొన్నారు. కులం పేరు చెప్పడానికి పువ్వాడకు సిగ్గనిపించడం లేదా అని ఆయన మండిపడ్డారు. ప్రాణం పోవడం కూడా చిన్న ఇష్యూనా.. ఇంతకు పువ్వాడకు బుర్ర ఉందా అని ఆయన ఎద్దేవా చేశారు. త్వరలో ఖమ్మంలో పువ్వాడ ఇంటిని ముట్టడిస్తామని ఆయన తెలిపారు. పోలీసులలో కొందరు తొత్తులుగా మారి అరాచకాలకు సహకరిస్తున్నారని, వారి సంగతి చూస్తామని ఆయన హెచ్చరించారు. 

Updated Date - 2022-04-23T23:27:51+05:30 IST