టీఆర్‌ఎస్, బీజేపీలో అందరూ డమ్మీలే: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2021-12-12T00:13:49+05:30 IST

టీఆర్‌ఎస్‌లో మంత్రులు, బీజేపీలో బండి సంజయ్, కేంద్రమంత్రి

టీఆర్‌ఎస్, బీజేపీలో అందరూ డమ్మీలే: జగ్గారెడ్డి

సంగారెడ్డి: టీఆర్‌ఎస్‌లో మంత్రులు, బీజేపీలో బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డమ్మీలేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉమ్మడి మెదక్‌లో కాంగ్రెసుకి చెందిన 230 ఓటర్లు తమకు ఓటేశారని ఆయన తెలిపారు.  హరీష్ జిల్లాలో ఏకగ్రీవం కాకుండా చేయడమే తమ మొదటి విజయమన్నారు. రెండున్నర ఏండ్లలో ఎంపీటీసీ, జడ్పీటీసీలను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. కానీ తాము అభ్యర్థిని నిలబెట్టడంతో అందరికీ హరీష్ టచ్‌లోకి వెళ్ళాడన్నారు. ఇది తమ రెండో విజయమన్నారు. కాంగ్రెస్‌కు చెందిన 230 ఓట్లు కొల్లగొట్టాలని హరీష్ చూశారని, కానీ కొల్లగొట్టలేదన్నారు. 230కి ఒక్క ఓటు తక్కువ వచ్చినా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌కి రాజీనామా చేస్తా అని చెప్పానన్నారు.  14 తేదీ ఫలితం వచ్చిన తర్వాత రాజీనామా మీద స్పందిస్తానన్నారు. తమ పార్టీ ఓట్లు కూడా తమకు పడక పోతే తానే బాద్యున్నని ఆయన స్పష్టం చేశారు. 


ఉమ్మడి జిల్లాలో రైతు ఆత్మహత్య బాధాకరమన్నారు. వరి వేసుకునే రైతును వద్దనే అధికారం రాష్ట్రం, కేంద్రానికి లేదన్నారు. ఇది రాచరిక పాలన కాదన్నారు. ప్రజాస్వామ్యం లో ప్రజలకు అనుకూల నిర్ణయాలు ఉండాలన్నారు. తెలంగాణలో కూడా ఏదో ఒకరోజు రైతు ఉద్యమం వస్తుందన్నారు. 

Updated Date - 2021-12-12T00:13:49+05:30 IST