ఎమ్మెల్యేను బలితీసుకున్న కరోనా
ABN , First Publish Date - 2020-09-24T22:14:14+05:30 IST
కర్ణాటకలో కరోనా సోకిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. కర్ణాటకలోని...
బెంగళూరు: కర్ణాటకలో కరోనా సోకిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. కర్ణాటకలోని బసవకళ్యాణ్ నియోజకవర్గ ఎమ్మెల్యే నారాయణ్ రావ్ కు కరోనా సోకడంతో సెప్టెంబర్ 1న మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. గురువారం సాయంత్రం 3.55కు చికిత్స పొందుతూ ఆయన చనిపోయినట్లు మణిపాల్ ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.
కరోనా సోకిన ఆయనలో తీవ్ర లక్షణాలు కనిపించడంతో వైద్యులు చికిత్సలో భాగంగా ఆయన కోలుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. అయినప్పటికీ రానురాను ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో.. గురువారం సాయంత్రం ఆయన తుది శ్వాస విడిచారు. ఎమ్మెల్యే కరోనాతో మరణించిన విషయం తెలియడంతో బసవకల్యాణ్ నియోజకవర్గంలో విషాద వాతావరణం నెలకొంది.