కాంగ్రెస్ నాయకత్వం దైవిక హక్కుకాదు
ABN , First Publish Date - 2021-12-03T08:05:33+05:30 IST
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్కిషోర్ గురువారం మరోసారి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీపై విరుచుకుపడ్డారు.
రాహుల్పై విరుచుకుపడిన ప్రశాంత్ కిషోర్
న్యూఢిల్లీ/కోల్కతా, డిసెంబరు 2: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్కిషోర్ గురువారం మరోసారి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీతో జత కట్టడానికి గతంలో రాహుల్తో చర్చలు కూడా జరిపారు. అది కార్యరూపం దాల్చలేదు. ఆ తరువాత కాంగ్రె్సకు దూరంగా ఉంటూ, తరచూ ఆ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. బలమైన ప్రతిపక్షానికి కాంగ్రెస్ పార్టీ చాలా ముఖ్యమైనదన్నారు. అయితే గడిచిన పదేళ్లలో 90 శాతం ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన నేపథ్యంలో ఆ పార్టీ నాయకత్వం ఓ వ్యక్తికి గల దైవదత్తహక్కు కాదని ట్విటర్లో పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రె్స(టీఎంసీ) అధినేత, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ యూపీఏ ఎక్కడుందని ప్రశ్నించిన మరుసటి రోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.