Lakhimpur Kheri:ఛత్తీస్ ఘడ్ సీఎం, పంజాబ్ డిప్యూటీ సీఎంల విమానాలు ల్యాండ్ కానీయద్దు

ABN , First Publish Date - 2021-10-04T17:00:28+05:30 IST

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్, పంజాబ్ డిప్యూటీ సీఎం ఎస్ఎస్ రాంధవాల విమానాలు లక్నో విమానాశ్రయంలో ల్యాండ్ కానీయవద్దని లక్నో విమానాశ్రయ అధికారులకు యూపీ సర్కారు సంచలన ఆదేశాలు జారీ చేసింది....

Lakhimpur Kheri:ఛత్తీస్ ఘడ్ సీఎం, పంజాబ్ డిప్యూటీ సీఎంల విమానాలు ల్యాండ్ కానీయద్దు

లక్నో విమానాశ్రయ అధికారులకు యూపీ సర్కారు ఆదేశాలు

లక్నో(ఉత్తరప్రదేశ్):ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్, పంజాబ్ డిప్యూటీ సీఎం ఎస్ఎస్ రాంధవాల విమానాలు లక్నో విమానాశ్రయంలో ల్యాండ్ కానీయవద్దని లక్నో విమానాశ్రయ అధికారులకు యూపీ సర్కారు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీ హింసాకాండ అనంతరం బాధితులను పరామర్శించేందుకు ఛత్తీస్ ఘడ్ సీఎం బాఘేల్, పంజాబ్ డిప్యూటీ సీఎం రాంధవాలను అనుమతించరాదని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ సర్కారు నిర్ణయించింది.బాధితులను పరామర్శించేందుకు వస్తున్న ప్రియాంకగాంధీని సోమవారం ఉదయం యూపీ పోలీసులు అడ్డుకొని నిర్బంధించారు.


లఖింపూర్ ఖేరీ ఘటనపై శాంతిభద్రతల సమస్య కారణంగా ఛత్తీస్ ఘడ్ సీఎం, పంజాబ్ డిప్యూటీ సీఎంలను లక్నో విమానాశ్రయంలో దిగడానికి అనుమతించరాదని యూపీ సర్కారు విమానాశ్రయ అధికారులను ఆదేశించింది. యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జరిగిన హింసాకాండ ఘటన సంచలనం రేపింది.నలుగురు రైతుల మృతికి కారణమైన కేంద్ర మంత్రి కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.కాగా తన కుమారుడు ఆశిష్ మిశ్రాకు హింసాకాండతో సంబంధం లేదని మంత్రి అజయ్ మిశ్రా ఖండించారు.


Updated Date - 2021-10-04T17:00:28+05:30 IST