బీజేపీలోకి కాంగ్రెస్ నాయకులు: ఎంపీ జీవీఎల్‌

ABN , First Publish Date - 2022-03-12T00:42:42+05:30 IST

దేశంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ

బీజేపీలోకి కాంగ్రెస్ నాయకులు: ఎంపీ జీవీఎల్‌

ఢిల్లీ: దేశంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయం నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ బోర్డ్ మూసేయ్యాల్సిన పరిస్థితి వచ్చిందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. పలువురు కాంగ్రెస్ నాయకులు బీజేపీలోకి చేరే అవకాశం ఉందన్నారు. దేశంలో మూడో ఫ్రంట్ ప్రయత్నం కాదని, టీఆర్‌స్‌కు మూడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మంచి మెజార్టీతో బీజేపీ అధికారంలోకి రానుందన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టమని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-12T00:42:42+05:30 IST