Bjp తీరును నిరసిస్తూ Congress ధర్నా
ABN , First Publish Date - 2022-05-17T15:15:41+05:30 IST
ఆదిద్రావిడుల ప్రత్యేక ఆర్థికసాయం రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ సోమవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆదిద్రావిడుల నిరుద్యోగ
ఐసిఎఫ్(చెన్నై): ఆదిద్రావిడుల ప్రత్యేక ఆర్థికసాయం రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ సోమవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆదిద్రావిడుల నిరుద్యోగ యువకులు, న్యాయవాదులు వృత్తులు ప్రారంభించేందుకు రూ.50 ప్రత్యేక ఆర్ధికసాయం సహా 8 సంక్షేమ పథకాలను బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఈ ధర్నా చేపట్టారు. స్థానిక చూలై తపాలా కార్యాలయం సమీపంలో జరిగిన ఈ ధర్నాకు ఎంపీ రంజన్కుమార్ నేతృత్వం వహించారు. కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొన్.రాధాకృష్ణన్, ఆ ప్రాంత శాఖా అధ్యక్షుడు, న్యాయవాది సీపీ నరేష్కుమార్, నాయకులు చంద్రశేఖర్, చూలై రాజేంద్రన్, నిత్యానందం, దేవరాజ్, మోహన్ యాదవ్, సూర్య, కుబేంద్రన్, సెల్వం, బుల్లెట్ గోపినాధ్ సహా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.