దేశ భవితను నిర్ణయించేది ప్రజలే: రాహుల్
ABN , First Publish Date - 2021-01-27T07:04:36+05:30 IST
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా ప్రజలకు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
న్యూఢిల్లీ, జనవరి 26: కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా ప్రజలకు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ భవితను నిర్ణయించేది ప్రజలే అని రాహుల్ ట్వీట్ చేశారు. ద్రవ్యోల్బణం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న సత్యాగ్రహ రైతు, కార్మికుడు, చిన్న-మధ్య తరహా వ్యాపారులు, ఉద్యోగాలు ఆశిస్తున్న యువకులు, గృహిణులు దేశ భవితను నిర్ణయిస్తారని ఆయన పేర్కొన్నారు.