దుబ్బాకలో కాంగ్రెస్ గెలిచి చరిత్ర సృష్టిస్తుంది: ఉత్తమ్

ABN , First Publish Date - 2020-10-31T15:14:47+05:30 IST

దుబ్బాకలో ప్రచారం పూర్తయ్యే వరకు ప్రతి నిమిషం అమూల్యమైనదని టీపీసీసీ అధ్యక్షులుఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

దుబ్బాకలో కాంగ్రెస్ గెలిచి చరిత్ర సృష్టిస్తుంది: ఉత్తమ్

హైదరాబాద్: దుబ్బాకలో ప్రచారం పూర్తయ్యే వరకు ప్రతి నిమిషం అమూల్యమైనదని  టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పోలింగ్ పూర్తి అయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దుబ్బాకలో కాంగ్రెస్ గెలిచి చరిత్ర సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో దుబ్బాకలో 20వేల ఓట్లు మాత్రమే కాంగ్రెస్‌కు వచ్చాయని..అయినా సమిష్టి కృషితో పార్టీకి ఊపు తెచ్చామని చెప్పుకొచ్చారు. దుబ్బాక చుట్టూ గజ్వెల్, సిద్దిపేట, సిరిసిల్ల ఉన్నా వివక్షకు గురైందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. చెరుకు ముత్యం రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే  దుబ్బాక  అభివృద్ధి జరిగిందని గుర్తుచేశారు. రామలింగారెడ్డి ఏం చేయలేనప్పుడు ఆయన సతీమణి ఏం అభివృద్ధి చేస్తుందని ఆయన ప్రశ్నించారు. రామలింగారెడ్డి బ్రతికుండగా పట్టించుకోని టీఆర్ఎస్.. మరణించిన తర్వాత  ప్రేమ ఉన్నట్లు  యాక్టింగ్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థి మీద అత్యాచార కేసులు ఉన్నాయన్నారు.


కేసీఆర్, హరీష్ రావుకు బీజేపీ అభ్యర్థి దగ్గరి బంధువు.. రఘునందన్ రావు గెలిచినా టిఆర్ఎస్‌లోకి వెళుతారని వ్యాఖ్యానించారు. పంట నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదని మండపిడ్డారు. ‘‘నో ఎల్ఆర్ఎస్, నో టీఆర్ఎస్’’ అదొక అమానవీయ చట్టమని అన్నారు. ఎల్ఆర్ఎస్‌ను కాంగ్రెస్ వచ్చాక ఉచితంగా చేస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేత శ్రావణ్ రెడ్డిని పోలీసులు ఇబ్బంది పెట్టాడాన్ని ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో సోదాలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభాకర్ రావు అనే రిటైర్డ్ అధికారి ద్వారా చట్ట వ్యతిరేకంగా తమ ఫోన్‌లు ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. రిటైర్డ్ అయిన ఒక సామాజిక వర్గం అధికారులతో ప్రతిపక్ష నేతలను వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై పార్లమెంట్‌లో పోరాటం చేస్తామని తెలిపారు. ‘‘టీఆర్ఎస్ ఇచ్చే డబ్బులు  తీసుకోండి.. కాంగ్రెస్‌కు ఓటెయ్యండి’’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Updated Date - 2020-10-31T15:14:47+05:30 IST