హైదరాబాద్‌లో మోదీ ప్రసంగం అట్టర్ ప్లాప్: Uttam kumar

ABN , First Publish Date - 2022-07-04T19:53:57+05:30 IST

నిన్న హైదరాబాద్‌ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం అట్టర్ ప్లాప్ అయ్యిందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్‌లో మోదీ ప్రసంగం అట్టర్ ప్లాప్: Uttam kumar

హైదరాబాద్: నిన్న హైదరాబాద్‌ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) ప్రసంగం అట్టర్ ప్లాప్ అయ్యిందని  కాంగ్రెస్ (congress) ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam kumar reddy) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అన్నట్టుగా బీజేపీ (BJP), టీఆర్ఎస్ (TRS) పార్టీల వైఖరి ఉందని వ్యాఖ్యానించారు. రెండు పార్టీలు దొందూ దొందే అనడానికి నిన్న జరిగిన సభే నిర్వచనమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అవినీతి జరిగితే ఈడీతో ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికలు తధ్యం... అందుకు అంతా సిద్ధం కావాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ (congress) అధికారంలోకి రావడం ఖాయమని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-07-04T19:53:57+05:30 IST