బద్వేలులో ఒరిజినల్ Congress, నకిలీ కాంగ్రెస్ మధ్యనే పోటీ!
ABN , First Publish Date - 2021-10-19T13:39:47+05:30 IST
ఈనెల 30వ తేదీన జరగబోవు బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రధాన పోటీ ఒరిజినల్ కాంగ్రెస్, నకిలీ కాంగ్రెస్
కడప జిల్లా/వేంపల్లె : ఈనెల 30వ తేదీన జరగబోవు బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రధాన పోటీ ఒరిజినల్ కాంగ్రెస్, నకిలీ కాంగ్రెస్ మధ్యనే అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అన్నారు. వేంపల్లెలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హస్తం గుర్తు మీద పోటీ చేస్తున్న భారత జాతీయ కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ అని, ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేస్తున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (జగన్ పార్టీ) నకిలీ కాంగ్రెస్ అని తులసిరెడ్డి వివరించారు. జగన్ పార్టీ పాలనలో నియో కవర్గంలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కార్యక్రమాలు కనిపించవని తులసిరెడ్డి అన్నారు.
ఖాళీగా ఉన్న 2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను అధికారంలోకి వస్తూనే భర్తీ చేస్తామని, ప్రత్యేక హోదా సాధన ద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని ఎన్నికల మేని ఫెస్టోలో పెట్టి, ఎన్నికల సభల్లో చెప్పి యువతను నమ్మించి, ఓట్లు పొంది అదికారంలోకి వచ్చాక హామీలను అమలు పరచకుండా వైసీపీ పార్టీ యు వజనులను నమ్మించి మోసగించిందనన్నారు. రైతు భరోసా కింద ప్రతి రైతుకుటుంబానికి ఏడాదికి రూ.12500 ఇస్తామని, ప్రతి పంటకు గిట్టు బాటు ధర కల్పిస్తామని చెప్పి రైతు వ్యతిరేక విధానాలు అవలం భిస్తోందన్నారు.
ఈ విధంగా యువజనులకు, శ్రామికులకు, రైతులకు అన్యాయం చేసిన జగన్ పార్టీకి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని పేరు పెట్టుకునే అర్హత కూడా జగన్ పార్టీకి లేదన్నారు. కావున నకిలీ కాంగ్రెస్ (జగన్ పార్టీ)ని ఓడించి హస్తం గుర్తు మీద ఓటు వేసి ఒరిజినల్ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న శ్రీమతి కమలమ్మను గెలిపించాలని తులసిరెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.