prime minister మోదీపై కాంగ్రెస్ నేత రజాఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-04-22T14:43:39+05:30 IST

కాంగ్రెస్ నేత, ఇస్లామిక్ పండితుడు తౌకీర్ రజాఖాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు...

prime minister మోదీపై కాంగ్రెస్ నేత రజాఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు

ధృతరాష్ట్రుడితో పోలుస్తూ కామెంట్

లక్నో (ఉత్తరప్రదేశ్): కాంగ్రెస్ నేత, ఇస్లామిక్ పండితుడు తౌకీర్ రజాఖాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.తౌకిర్ రజాఖాన్ ప్రధాని నరేంద్ర మోదీని ధృతరాష్ట్రుడితో పోల్చి కొత్త వివాదం సృష్టించారు. ఢిల్లీలోని జహంగీర్ పురిలో బుల్డోజర్ చర్యపై ప్రధాని మోదీని ఉద్ధేశించి తౌకీర్ రజాఖాన్ మాట్లాడారు. ముస్లింలపై జరుగుతున్న అకృత్యాలపై ప్రధాని మోదీ గుడ్డిగా, చెవిటిగా ఉంటే భారతదేశంలో మళ్లీ మహాభారతం జరగకుండా ఎవరూ ఆపలేరని అన్నారు. తౌకిర్ రజా ఇక్కడితో ఆగలేదు. ముస్లింలు తమ ఇళ్ల నుంచి వీధుల్లోకి వస్తే వారిని ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు.ప్రధాని మోదీపై, హిందూ సమాజంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు తౌకీర్ రజా ఖాన్‌ను ఇప్పటికే అరెస్టు చేశారు. యూపీ ఎన్నికలకు ముందు తౌకీర్ రజా ఖాన్ కాంగ్రెస్‌లో చేరారు.


 సీఏఏకి వ్యతిరేకంగా జరిగిన నిరసనల సమయంలో ఇస్లామిక్ మత గురువు తౌకిర్ రజా ఖాన్ ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలను కూడా ఉగ్రవాదులు అంటూ గతంలో పిలిచారు.వివాదాస్పద ప్రకటనల కారణంగా యూపీ పోలీసులు తౌకీర్ రజాపై ఐపీసీ సెక్షన్లు 304, 305, 153-కె కింద కేసు నమోదు చేశారు. దీంతో ఆగ్రహించిన తౌకిర్ రజా కూడా సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తౌకిర్ రజా సున్నీ ముస్లింలకు చెందిన బరేల్వీ వర్గానికి చెందిన మౌలానాగా గుర్తింపు పొందారు. తౌకీర్ రజా ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించారు.


Updated Date - 2022-04-22T14:43:39+05:30 IST