MP Gorantla madhavకు తగిన శిక్ష పడాలి: సుంకర పద్మశ్రీ

ABN , First Publish Date - 2022-08-04T18:27:37+05:30 IST

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపాయని కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ అన్నారు.

MP Gorantla madhavకు తగిన శిక్ష పడాలి: సుంకర పద్మశ్రీ

విజయవాడ: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్(Gorantla madhav)రాసలీలలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం  రేపాయని కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ(Sunkara padma sri) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుతూ మహిళలను శారీరకంగా హింసిస్తున్న నీచుడికి తగిన శిక్ష పడాలన్నారు.  వైసీపీ ఎంపీ (YCP MP)ని తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దిశ చట్టాలు ఏమైపోయాయని, హోంమంత్రి, మహిళ కమిషన్ చైర్ పర్సన్  కూడా ఒక మహిళలే అని... వైసీపీ నేతలు ఎన్ని దుర్మార్గాలు చేసినా ఏమీ మాట్లాడరా అని ప్రశ్నించారు. ఎంపీ గోరంట్ల మాధవ్ ఎలక్షన్స్ సమయంలో అఫిడవిట్లో రేప్ కేస్ అతనిపై ఉందని తెలిపారు. నేర చరిత్ర ఉన్న వాళ్లందర్నీ ఎంపీలు, ఎమ్మెల్యేలను చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(Jagan mohan reddy) కే నేర చరిత్ర ఉందని సుంకర పద్మశ్రీ వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-08-04T18:27:37+05:30 IST