విదేశాలకు సప్లయ్ చేసే వ్యూహం ఉండాలి: మాజీ ఎంపీ సిరిసిల్ల
ABN , First Publish Date - 2021-11-27T22:44:41+05:30 IST
రాష్ట్రంలో పండిన అదనపు ధాన్యాన్ని నిల్వ చేసి ఇతర
హైదరాబాద్: రాష్ట్రంలో పండిన అదనపు ధాన్యాన్ని నిల్వ చేసి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు సప్లయ్ చేసే వ్యూహం ఉండాలని మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య అన్నారు. ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ నగరంలో కాంగ్రెస్ ఆధ్యర్యంలో జరుగుతున్న వరి దీక్షలో ఆయన మాట్లాడారు. వడ్లు కొనకుండా కేంద్ర, రాష్ట్ర సర్కార్లు దొంగ డ్రామాలాడుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ రెండు ప్రభుత్వాలకు వ్యవసాయ ప్రణాళికలు లేవన్నారు. ప్రజలను, రైతులను మోసం చేస్తూ మోదీ, కేసీఆర్ పాలన చేస్తున్నారని ఆరోపించారు. రైతులను చైతన్య పరిచే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుందని ఆయన పేర్కొన్నారు.