ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి కమిటీ: షబ్బీర్ అలీ

ABN , First Publish Date - 2021-11-11T02:12:30+05:30 IST

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ విషయంలో ఒక కమిటీని

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి కమిటీ: షబ్బీర్ అలీ

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ విషయంలో ఒక కమిటీని వేశామని కాంగ్రెస్ పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ తెలిపారు. దామోదర రాజనర్సింహ, చిన్నారెడ్డి, బలరాం నాయక్ నేతృత్వంలో కమిటీ వేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికలు ఉన్న జిల్లా నేతలతో చర్చ జరిపి పీసీసీకి నివేదిక ఇస్తారన్నారు. పోడు భూములపై నిర్ణయం తీసుకోవాలని చర్చించామన్నారు. గిరిజనుల పేరున తమ బినామీలతో వందల ఎకరాలను కబ్జా చేయాలని  టీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కలిసొచ్చే పార్టీలతో వాచ్ డాగ్ మాదిరిగా లోకల్‌గా నిఘా పెట్టాలని నిర్ణయించామన్నారు. నిన్న సమావేశం జరుగుతున్న సమయంలో జనగామ జిల్లా నేతల తీరుపై క్రమశిక్షణ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందని షబ్బీర్ అలీ తెలిపారు. 

Updated Date - 2021-11-11T02:12:30+05:30 IST