అలంపూర్ ప్రాంతం ఏం పాపం చేసింది?: సంపత్

ABN , First Publish Date - 2021-08-20T17:37:44+05:30 IST

జిల్లాలోని మాజీ ప్రధాన మంత్రి, దివంగత నేత రాజీవ్ గాంధీ 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

అలంపూర్ ప్రాంతం ఏం పాపం చేసింది?: సంపత్

జోగులాంబ గద్వాల: జిల్లాలోని మాజీ ప్రధాన మంత్రి, దివంగత నేత రాజీవ్ గాంధీ 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజీవ్ చిత్రపటానికి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై నిరసనలు వెల్లువెత్తాయని... అందుకే కేటీఆర్ పర్యటన వాయిదా వేసుకున్నారని అన్నారు. ఆలంపూర్, గద్వాలలో ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పర్యటనను వాయిదా వేసుకుని తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిన కేటీఆర్..ఇప్పటికైనా కళ్ళు తెరిచి హామీలు నెరవేర్చిన తర్వాతనే పర్యటించాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్‌లో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు 3 ఎకరాలు ఎన్నో హామీలు ఇచ్చి నెరవేరుస్తున్నారని అన్నారు. అలంపూరు ప్రాంతం ఏం పాపం చేసిందని సంపత్ ప్రశ్నించారు..


Updated Date - 2021-08-20T17:37:44+05:30 IST