ప్రజాధనాన్ని మోదీ, జగన్ దోచేస్తున్నారు: Sailajanath
ABN , First Publish Date - 2021-11-14T18:37:56+05:30 IST
ప్రజాధనాన్ని మోదీ, జగన్ దోచేస్తున్నారని ఎపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ వ్యాఖ్యానించారు.
అమరావతి: ప్రజాధనాన్ని మోదీ, జగన్ దోచేస్తున్నారని ఎపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ వ్యాఖ్యానించారు. కేంద్ర బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జన జాగరణ అభియాన్ యాత్రను శైలజానాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరల పెంపుపై ప్రజలు గొంతెత్తితే అరెస్టులతో భయపెడతారా? అని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరలపై జగన్రెడ్డి ట్యాక్స్ తగ్గించాలని, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా మోదీ రూ.50కే పెట్రోల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు. మోదీ, జగన్ నియంతృత్వ పాలనతో ప్రజలు బుద్ధి చెప్తారని శైలజానాథ్ పేర్కొన్నారు.