పేరు గొప్ప... ఊరు దిబ్బలా జగన్ ప్రభుత్వం: Sailajanath
ABN , First Publish Date - 2022-05-19T16:35:07+05:30 IST
వైసీపీ ప్రభుత్వంపై పీసీసీ చీఫ్ సాకె శైలజానాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై పీసీసీ చీఫ్ సాకె శైలజానాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రోడ్లకు మరమత్తులు ఏవి అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వకుంటే రోడ్లు ఎలా వేస్తారని నిలదీశారు. రివర్స్ టెండర్తో పాలన అంతా రివర్స్ అంటూ విమర్శించారు. ఎన్డీబీ నుంచి తీసుకున్న రుణం ఏమైందని అడిగారు. పేరు గొప్ప... ఊరు దిబ్బలా జగన్ రెడ్డి ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెలికాప్టర్లో కాకుండా రోడ్లపై జగన్ రెడ్డి తిరగాలని హితవుపలికారు. రహదారులపై కేటాయించిన రూ.6400 కోట్లు ఎటు మళ్లించారో శ్వేత పత్రం విడుదల చేయాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.