కుయ్..కుయ్..అంటూ తిరిగే 108 వాహనాలు ఏమయ్యాయి: Sailajanath

ABN , First Publish Date - 2022-05-05T17:37:37+05:30 IST

రాష్ట్రంలో రోజుకో అమానుష ఘటన జరుగుతున్నా ప్రభుత్వ తీరులో మార్పు లేదని పీసీసీ చీఫ్ శైలజానాథ్ అన్నారు.

కుయ్..కుయ్..అంటూ తిరిగే 108 వాహనాలు ఏమయ్యాయి: Sailajanath

అమరావతి: రాష్ట్రంలో రోజుకో అమానుష ఘటన జరుగుతున్నా ప్రభుత్వ తీరులో మార్పు లేదని పీసీసీ చీఫ్ శైలజానాథ్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ...అంబులెన్స్ మాఫియాకు అడ్డుకట్ట వేయడానికి ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. బాలుడి మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్‌లు దోపిడీకి పాల్పడుతున్నాయని అన్నారు. కుయ్..కుయ్..అంటూ తిరిగే 108 వాహనాలు ఏమయ్యాయని నిలదీశారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. పబ్లిసిటీ పిచ్చితో జెండా ఊపిన వాహనాలన్నీ ఎక్కడికి పోయాయోని జగన్‌రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. సిబ్బంది, కనీస సౌకర్యాల లేమితో ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయని శైలజానాథ్ అన్నారు. 

Read more