Renuka chowdary: శశిధర్ రెడ్డి ఓపికగా ఉండే వ్యక్తి
ABN , First Publish Date - 2022-08-18T19:25:52+05:30 IST
కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఓపికగా ఉండే వ్యక్తి అని ఆ పార్టీ నేత రేణుకా చౌదరి అన్నారు.
హైదరాబాద్: కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి (Marri shashidhar reddy) ఓపికగా ఉండే వ్యక్తి అని ఆ పార్టీ నేత రేణుకా చౌదరి (Renuka chowdary) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఆయనకు ఏదో మనసుకు బాధ అనిపించి మాట్లాడి ఉంటారని చెప్పుకొచ్చారు. శశిధర్ రెడ్డి సమస్య సర్దుకుంటుందని తెలిపారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) కూడా ఏదైనా ఉంటే సరిదిద్దుకోవాలని సూచించారు. ‘‘పార్టీలో మమ్మల్ని అవమానించే వారు ఎవరు లేరు. అవమానిస్తే దుమారం ఎలా లేపాలో మాకు కూడా తెలుసు. ఖమ్మం లో నన్ను ఎదుర్కునే మొనగాడు లేడు’’ అని తెలిపారు. కాంగ్రెస్ నుంచి రాజగోపాల్ రెడ్డి (Rajagopal reddy) వెళ్లడం బాధాకరమన్నారు. మునుగోడు (Munugodu by poll)లో కాంగ్రెస్ (Congress) గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు ఇలాంటివి సహజం అన్ని సర్దుకుంటాయని చెప్పారు. బీజేపీ (BJP)లో కూడా చాలా సమస్యలు, నేతల మధ్య విబేధాలు ఉన్నాయని రేణుకా చౌదరి పేర్కొన్నారు.