రోశయ్య కుమారుడు శివకు రాహుల్ గాంధీ ఫోన్

ABN , First Publish Date - 2021-12-04T17:32:13+05:30 IST

మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించి సానుభూతి వ్యక్తం చేశారు.

రోశయ్య కుమారుడు శివకు రాహుల్ గాంధీ ఫోన్

హైదరాబాద్: మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల  ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్  గాంధీ సంతాపం ప్రకటించి సానుభూతి వ్యక్తం చేశారు. ఈ మేరకు రోశయ్య కుమారుడు శివతో రాహుల్ ఫోన్‌లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి రోశయ్యకు ఉన్న అనుబంధాన్ని కాంగ్రెస్ నేత గుర్తు చేసుకున్నారు. ఆపై కేవీపీ రామచందర్ రావ్‌తో రాహుల్ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా రోశయ్య మృతి వివరాలను  రాహుల్‌కు కేవీపీ వివరించారు.

Updated Date - 2021-12-04T17:32:13+05:30 IST