మీకు బాధ్యత లేదా?: పొన్నాల
ABN , First Publish Date - 2021-11-30T03:02:44+05:30 IST
యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనకపోతే మీకు
హైదరాబాద్: యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనకపోతే మీకు బాధ్యత లేదా అని సీఎం కేసీఆర్ను టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల నిలదీశారు. యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవని ప్రకటించిన సీఎం కేసీఆర్పై పొన్నాల మండిపడ్డారు. యాసంగి ధాన్యం కొనబోమని చావు కబురు చల్లగా చెప్పారని ఆయన ఆరోపించారు. కేంద్రం చెప్పింది చెప్పడానికి పోస్టుమెన్ వా లేక సీఎంవా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్, మోదీ కలిసి దొంగాట ఆడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రెస్ మీట్ రైతుల కోసమా, బీజేపీ తిట్టడానికా అని పొన్నాల ప్రశ్నించారు.