KCRపై అవినీతిని వెలికి తీసి ప్రధాని చిత్తశుద్ధి చాటుకోవాలి: Ponnala

ABN , First Publish Date - 2022-05-27T19:26:51+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ పొరుగు రాష్ట్రానికి తప్పించుకు వెళ్లడం దుర్మార్గమని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు.

KCRపై అవినీతిని వెలికి తీసి ప్రధాని చిత్తశుద్ధి చాటుకోవాలి: Ponnala

హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra modi) హైదరాబాద్‌కు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ పొరుగు రాష్ట్రానికి తప్పించుకు వెళ్లడం దుర్మార్గమని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య(Ponnala laxmaiah) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... నిన్నటి రోజు ప్రజాస్వామ్యంలో చీకటి రోజన్నారు. స్వయంగా ప్రధాని నోటి వెంట కేసీఆర్‌పై అవినీతి వ్యాఖ్యలు చేశారని తెలిపారు. మాటలకు పరిమితం కాకుండా సీఎం కేసీఆర్‌పై అవినీతిని వెలికి తీసి ప్రధాని చిత్తశుద్ధి చాటుకోవాలని సవాల్ విసిరారు. ప్రధాని దగ్గర కేసీఆర్ అవినీతిపై ఆధారాలు ఉంటే రాష్ట్రపతి పాలన పెట్టి కేసీఆర్‌పై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతి సొమ్ముతో దేశ పర్యటన చేస్తున్న చిల్లర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ సమస్యలపై మాట్లాడకుండా కేవలం ప్రధాని మోదీ కేవలం రాజకీయం మాట్లాడడం దుర్మార్గమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజలు చెంపదెబ్బ కొట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయని పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-27T19:26:51+05:30 IST