రైతులకు అండగా కాంగ్రెస్: పొన్నాల లక్ష్మయ్య

ABN , First Publish Date - 2022-01-29T22:43:07+05:30 IST

రాష్ట్రంలోని రైతులకు, నిరుద్యోగులకు అండగా ఉండి కాంగ్రెస్

రైతులకు అండగా కాంగ్రెస్: పొన్నాల లక్ష్మయ్య

హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులకు, నిరుద్యోగులకు అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని టీపీసీసీ  మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. గన్‌పార్క్ వద్ద చేపట్టిన మౌన దీక్షను కాంగ్రెస్ నేతలు విరమించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువత, రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని మౌన దీక్ష చేపట్టామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 6 సంవత్సరాల్లో పంట నష్టం చెల్లించారా అని ఆయన ప్రశ్నించారు. కౌలు రైతుల గురించి ఆలోచించారా అని ఆయన నిలదీశారు. 550 మద్దతు ధరను 1500 చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆందోళన అధికారం కోసం కాదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన దానిపై చర్చకు రమ్మంటున్నామని ఆయన సవాల్ విసిరారు.  

Updated Date - 2022-01-29T22:43:07+05:30 IST