కాంగ్రెస్‌తోనే దేశాభివృద్ధి : మస్తాన్‌వలి

ABN , First Publish Date - 2021-06-18T05:57:37+05:30 IST

దేశం, రాష్ట్రాభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి తెలిపారు.

కాంగ్రెస్‌తోనే దేశాభివృద్ధి : మస్తాన్‌వలి
పండ్లు, మాస్కులు పంపిణీ చేస్తున్న మస్తాన్‌వలి, లింగంశెట్టి తదితరులు

గుంటూరు, జూన్‌ 17: దేశం, రాష్ట్రాభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి తెలిపారు. ఈ నెల 19న రాహుల్‌గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు తదితరులు గురువారం పేదలకు పండ్లు, మాస్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు కొరివి వినయ్‌కుమార్‌, అడవి ఆంజనేయులు, ఉస్మాన్‌, కరీం తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-18T05:57:37+05:30 IST