22న ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ ధర్నా, 27న భారత్ బంద్

ABN , First Publish Date - 2021-09-19T03:39:17+05:30 IST

22న ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ ధర్నా, 27న భారత్ బంద్

22న ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ ధర్నా, 27న భారత్ బంద్

హైదరాబాద్: దళిత గిరిజన సమస్యలపై పోరాటంలో విజయం సాధించామని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. నిరుద్యోగ సమస్యలపై ఫైట్ చేయాలని పార్టీ నిర్ణయించిందన్నారు. అక్టోబర్‌ 2 నుండి డిసెంబర్ 9 వరకు పోరాటం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆదివారం గాంధీ భవన్‌లో ప్రతిపక్షాల నేతలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ నెల 22న ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. 27న భారత్ బంద్ నిర్వహిస్తున్నామని వ్యాఖ్యానించారు. చివరి సభకు సోనియా లేదా రాహుల్‌ హాజరయ్యేలా ప్లాన్ చేసినట్లు మల్లు రవి పేర్కొన్నారు. 

Updated Date - 2021-09-19T03:39:17+05:30 IST