హైదరాబాద్: టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం లిక్కర్ తెలంగాణ(Telangana)గా మారిందని కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్(Madhuyashki goud) విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రజల సంపాదన మద్యం పాలు.. సంసారాలు వీధులపాలు అవుతున్నాయన్నారు. ఏడేండ్లలో మద్యం అమ్మకాల సొమ్ము లక్ష 35 వేల కోట్లకు పెరిగిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు 10 వేల కోట్లు మాత్రమే ఉండేదన్నారు. ప్రత్యేక తెలంగాణలో మద్యం అమ్మకాలు ఏటేటా రికార్డులు బద్దలు కొడుతున్నాయని అన్నారు. ఈ ఏడాది 40 వేల కోట్ల అమ్మకాల లక్ష్యంగా పెట్టుకోవడం సిగ్గు చేటని మండిపడ్డారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ నేరస్థులను కాపాడుతోందని ఆరోపించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని మధుయాష్కీ గౌడ్ అన్నారు.
ఇవి కూడా చదవండి