Congress leader: ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ అన్యాయంగా గెలిచారు
ABN , First Publish Date - 2022-08-19T19:27:18+05:30 IST
ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్యాయంగా గెలిచారని ధర్మపురి కాంగ్రెస్ ఇంచార్జ్ లక్ష్మణ్ ఆరోపించారు.
కరీంనగర్: ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) అన్యాయంగా గెలిచారని ధర్మపురి కాంగ్రెస్ ఇంచార్జ్ లక్ష్మణ్ (Laxman) ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. నిజాయితీగా గెలిస్తే మంత్రి కొప్పుల (Telangana Minister) రీ కౌంటింగ్ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24న రీకౌంటింగ్ కోరాలన్నారు. ఆరుగురు లాయర్లతో కొప్పుల కోర్టుకెళ్లారని తెలిపారు. కొప్పుల ఈశ్వర్ లాయర్ల ఖర్చులు కేసీఆర్ (CM KCR) కుటుంబం భరిస్తోందన్నారు. కేసీఆర్ (KCR) మంత్రివర్గంలో కొనసాగడానికి కొప్పుల అనర్హుడని కాంగ్రెస్ నేత లక్ష్మణ్ వ్యాఖ్యలు చేశారు.