బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అన్యాయం: కోదండ రెడ్డి
ABN , First Publish Date - 2022-02-01T21:53:23+05:30 IST
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి తీవ్ర
హైదరాబాద్: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత కోదండ రెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ పెద్దలకు అప్పజెప్పేలా ఉందన్నారు. సబ్సిడీ స్కీములు మొత్తం తగ్గించారన్నారు. వ్యవసాయ రుణాల రాయితీలను ఎత్తేశారన్నారు. పంటల మార్పిడిపై కేంద్ర వైఖరి బయటపడిందని ఆయన ఆరోపించారు. 23 పంటలకు కనీస మద్దతు ధర కేటాయింపులను 10వేల కోట్లకు తగ్గించారన్నారు. కరోనా సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టింది వ్యవసాయ రంగమేనని ఆయన తెలిపారు.