‘మమత సర్కార్ ఫెయిల్’ అని ప్రధానికి లేఖ రాసిన కాంగ్రెస్ ఎంపీ

ABN , First Publish Date - 2020-05-26T22:32:53+05:30 IST

అంఫాన్ తుఫాను నష్టనివారణ చర్యల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ విఫలమయ్యారని...

‘మమత సర్కార్ ఫెయిల్’ అని ప్రధానికి లేఖ రాసిన కాంగ్రెస్ ఎంపీ

న్యూఢిల్లీ: అంఫాన్ తుఫాను నష్టనివారణ చర్యల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విఫలమయ్యారని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి ప్రధాని మోదీకి లేఖ రాశారు. సహాయక చర్యల్లో మమత ప్రభుత్వం విఫలమైనందున పశ్చిమ బెంగాల్‌కు మరిన్ని ఆర్మీ బలగాలను పంపించాలని ప్రధానిని ఆయన లేఖలో కోరారు.


తుఫాను వల్ల నష్టపోయిన చాలా ప్రాంతాల్లో ప్రభుత్వం నామమాత్రంగానే ఆహారం పంపిణీ చేస్తోందని ఆయన తెలిపారు. అంఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా ప్రాంతాలు అంధకారంలోనే ఉన్నాయని ఆయన ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కోల్‌కత్తా నగరంలోని చాలా ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని ఆయన లేఖలో ప్రస్తావించారు. కేంద్రం ఈ పరిస్థితుల దృష్ట్యా సత్వరమే సాయం చేయాలని ప్రధానికి రాసిన లేఖలో అధీర్ రంజన్ చౌదరి కోరారు.

Updated Date - 2020-05-26T22:32:53+05:30 IST