ఆయనకు దానిపైనే ప్రేమ: వీహెచ్

ABN , First Publish Date - 2021-05-08T19:27:21+05:30 IST

ఓ వైపు కరోనాతో ప్రజల ప్రాణాలు పోతున్నాయి.. మరో వైపు రాష్ట్రంలో పేదల అసైన్డ్ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతురావు పేర్కొన్నారు.

ఆయనకు దానిపైనే ప్రేమ: వీహెచ్

హైదరాబాద్: ఓ వైపు కరోనాతో ప్రజల ప్రాణాలు పోతున్నాయి.. మరో వైపు రాష్ట్రంలో పేదల అసైన్డ్ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతురావు పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మంత్రి మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ చెరువులో ఉందన్నారు. మంత్రి మల్లారెడ్డి హాస్పిటల్‌కి వెళ్లి నిరసన తెలిపిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కి సచివాలయం మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెంత దోచుకుంటావు మంత్రి మల్లారెడ్డి.. దోచుకున్న దానిలో దానం చెయ్ అని  హనుమంతురావు చెప్పారు.


పక్క రాష్ట్రం తమిళనాడులో స్టాలిన్ ఒక్కో కుటుంబానికి నాలుగు వేలు ఇస్తున్నాడు ..కేసీఆర్ తెలంగాణలోని ఒక్కో కుటుంబానికి పదివేలు ఇవ్వాలని వీహెచ్ డిమాండు చేశారు. సీఎం కేసీఆర్‌కి కరోనా కంటే అవినీతి ముఖ్యమన్నప్పుడు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఒక్కరిమీద కాదు అందరి మీద విచారణ చేయాలని హనుమంతురావు డిమాండు చేశారు.

Updated Date - 2021-05-08T19:27:21+05:30 IST