రైతు ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణం: అన్వేష్ రెడ్డి

ABN , First Publish Date - 2021-12-11T00:23:30+05:30 IST

మెదక్ జిల్లాలో హావేలి ఘనపూర్ మండలంలోని బోగుడ

రైతు ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణం: అన్వేష్ రెడ్డి

హైదరాబాద్: మెదక్ జిల్లాలో హావేలి ఘనపూర్ మండలంలోని  బోగుడ భూపతిపూరులో రవికుమార్ అనే రైతు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రభుత్వమే కారణమని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి ఆరోపించారు. వ్యవసాయ అధికారులు గ్రామాల్లోకి వచ్చి యాసంగి వరి వేయొద్దు అని ఒత్తిడి తేవడం వల్లే రవికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ధాన్యం అమ్మి 15 రోజులు అయినారవికుమార్‌కు డబ్బులు రాలేదన్నారు.


వరి తప్ప వేరే పంట పండని భూమిలో వరి వద్దంటే ఏ పంట పండని పరిస్థితి కారణంగానే  ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. రవికుమార్ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పండించే పంటలమీద ఆంక్షలు విధించడానికి వచ్చే అధికారులను నిలడియాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు. రైతులకు అండగా కిసాన్ కాంగ్రెస్ ఉంటుందని ఆయన విజ్ఞప్తి  చేశారు. 



Updated Date - 2021-12-11T00:23:30+05:30 IST