నిన్న చంద్రబాబుని చూస్తే నవ్వొచ్చింది: Chinta mohan

ABN , First Publish Date - 2021-11-16T16:30:38+05:30 IST

నిన్న టీడీపీ అధినేత చంద్రబాబుని చూస్తే తనకు నవ్వు వచ్చిందని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతామోహన్ అన్నారు.

నిన్న చంద్రబాబుని చూస్తే నవ్వొచ్చింది: Chinta mohan

తిరుపతి: నిన్న టీడీపీ అధినేత చంద్రబాబుని చూస్తే తనకు నవ్వు వచ్చిందని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతామోహన్ అన్నారు. టీడీపీ హయాంలో తిరుపతి ఉప ఎన్నికల సమయంలో ఎం జరిగిందో అదే నేడు కుప్పంలో జరిగిందన్నారు. కుప్పంలో దొంగ ఓటర్లు హల్ చల్ చేశారని... అధికారపార్టీ నేతలు విధ్వంసం సృష్టించారని తెలిపారు. అధికార దుర్వినియోగం కుప్పంలో స్పష్టంగా కనిపించిందన్నారు. దేశంలో బీజేపీ బలహీనపడిందని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 50 లోక్‌సభ సీట్లు మించి రాదన్నారు. మూడురోజుల అమిత్ షా తిరుపతి పర్యటన బీజేపీ బలహీనపడుతోందని చెబుతోందన్నారు. బీజేపీ అభివృద్ధి ఆపేసి అమ్ముకోవడం ప్రారంభించిందని విమర్శించారు. ఏపీలో విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు సంక్రాంతిలోపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీలో రెడ్ల రాజ్యం రాజ్యమేలుతోందన్నారు. రాష్ట్ర సంపదను రెడ్లు దోచేసేతున్నారని ఆరోపించారు. 2024లో కాపు కులస్తులే సీఎం కావాలని చింతామోహన్ అన్నారు. 

Updated Date - 2021-11-16T16:30:38+05:30 IST